వరంగల్ మహా నగరంగా ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ (మామూనూరు) విమానాశ్రయ భూ సేకరణ, ఇతర ప్రణాళికలపై ఐసీసీసీలో గురువారం రాత్రి సమీక్ష నిర్వహించారు. దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని, ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలా విమానాశ్రయం ఉండాలని అభిప్రాయపడ్డారు.