అభివృద్ధి పనులలో వేగం పెంచి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. గురువారం పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిని కమిషనర్ పరిశీలించారు. బాలసముద్రం, పోతన సెకండరీ ట్రాన్స్పోర్టేషన్లను పరిశీలించి నిర్వహణ క్రమపద్ధతిలో జరగాలని, చెత్త సేకరణలో నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.