వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ రౌడీషీటర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లు నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అసాం ఘిక కార్యకలాపాలు కొనసాగించేవారిపై గట్టి నిఘా ఉంటుందని కౌన్సెలింగ్ చేశారు.