ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వివిధ అంశాలపై చర్చించి కేసుల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.