రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్ల 25 లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో 75వ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ గుండు సుధారాణి తో కలిసి సురేఖ మొక్కలు నాటారు. 12 ఫీట్లు ఉన్న మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారని, తాను వరంగల్ జిల్లా వాసిని కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటాలని అధికారులకు సూచించారు.