హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన సుందరీమణులు బుధవారం సాయంత్రం వరంగల్ కోటకు విచ్చేశారు. 22 దేశాలకు చెందిన సుందరీమణులకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఓరుగల్లు కు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలకు నిలువైన స్టాల్స్ ను సందర్శించారు. ఖిలా వరంగల్ తోరణం ముందు ఫోటోలు దిగారు. కోటలో ఉన్న శిల్పాలను వాటి యొక్క చరిత్రను గైడులను అడిగి తలుసుకున్నారు.