వరంగల్, గీసుకొండ మండలంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో టోర్నమెంట్ నిర్వహణపై గురువారం కలెక్టర్ సత్య శారద సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జనవరి 8, 9,10, 11 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి సీనియర్స్ ఖోఖో టోర్నమెంట్ కు దాదాపు 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారని, వారికి కావలసిన మౌళిక సదుపాయాల ఏర్పాటుకు త్రాగునీటి వసతులు, శానిటేషన్, హాస్టల్ సౌకర్యం కల్పించుట అంశాల పై సమీక్షించారు.