మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని వారి నివాసంలో పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళల పై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళలకు విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా సావిత్రీబాయి ఫూలే ఖ్యాతిగడించారని మంత్రి అన్నారు.