వరంగల్ లేబర్ కాలనీ లో తల్లిదండ్రులు చనిపోవడంతో ఆంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో దీనంగా చూస్తున్న పిల్లలను చూసి పోలీసులు, స్థానికులు ఆర్థికసాయం చేశారు. మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య రూ.10వేలు, ఇద్దరు ఎస్సైలు చందర్, శ్రీకాంత్ లు చేరో రూ. 5వేలు, కార్పొరేటర్ వస్కుల బాబు, మాజీ కార్పొరేటర్ రాజేందర్ చేరో రూ. 5 వేలు, రాజేష్, రమేష్ చేరో రూ.3వేలు అందించారు. కాలనీవాలసులు కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.