టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఘన విజయం సాధించి. రోహిత్ సేన విశ్వ విజేతగా నిలవడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 17 ఏళ్ల నిరీక్షణ తరువాత టీ 20 వరల్డ్ కప్ లో భారత్ విజయం తనకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.