మామిడి సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక ఉత్పత్తులు సాధించి ఎగుమతుల్లో పోటీ పడాలని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా అన్నారు. గురువారం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వర్ధన్నపేట మండలం దమ్మన్నపేటలో శుక్రవారం జరిగే మామిడి రైతుల అవగాహన కార్యక్రమంపై పండ్ల మర్చంటీస్, మార్కెటింగ్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులతో జరిగిన సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.