యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు. గంజాయి, ఇతర పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై కేయుసి పోలీసుల కిట్స్ కళాశాలలో డివిజన్ పోలీసుల అధ్వర్యంలో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విధ్యార్థులకు గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.