హనుమకొండ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయంలో సెల్ట్ ఆధ్వర్యంలో 40 రోజుల పాటు నిర్వహించే స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయని, ఆసక్తి గల విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, తమ పేర్లను జులై 9 లోగా నమోదు చేసుకోవాలని సెల్ట్ సంచాలకులు మేఘనారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ విద్యార్థులు రూ. 1000, ఇతరులు రూ. 1500 చెల్లించాలన్నారు.