ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవాలలో భాగంగా అమ్మవారు బుధవారం ఉదయం కురుకుల్లా క్రమం అలంకరణలో భక్తులకు దర్శమిస్తున్నారు. భక్తులు శాకాంబరి మహోత్సవంలో భాగంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రము భేరుండా క్రమంలో భద్రకాళి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నట్లుగా ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.