బాల రక్షా భవన్ లోని అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలనీ జువేనైల్ బోర్డు న్యాయమూర్తి యం. డి ఫరీహ అహ్మద్ అన్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న హన్మకొండ జిల్లా బాల రక్షా భవన్ లోని జువేనైల్ బోర్డు వడ్డేపల్లి యం. పి. పి. ఓ భవన్ లోకి మార్చడంతో శుక్రవారం వారు జువేనైల్ జస్టిస్ బోర్డును ప్రారంభించారు. బాలల కోసం పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.