హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం రంగసాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్న ఆయనను కేడీసీకి ఎఫ్ఏసి ప్రిన్సిపాల్ గా నియమిస్తూ కళాశాల విద్య కమిషనరేట్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.