హనుమకొండలో ప్రైవేటు కార్పొరేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు డీఈఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు. విచ్చలవిడిగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ, లక్షల రూపాయల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.