
భారత సైన్యానికి 7.5 లక్షల ట్రక్కులను అందిస్తాం: AIMTC
సరిహద్దుల్లో పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో భారత సైన్యానికి సాయం చేసేందుకు AIMTC ముందుకొచ్చింది. మధ్యప్రదేశ్కు చెందిన సుమారు 7.5 లక్షల ట్రక్కులను సైన్యానికి ఉచితంగా అందిస్తామని AIMTC రాష్ట్ర చీఫ్ సీఎల్ ముకాఠి తెలిపారు. ‘సరిహద్దు ప్రాంతాల్లో మన సైన్యం ప్రదర్శించే ధైర్య సాహసాల వల్లే ప్రజలు సురక్షితంగా ఉంటున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలోనూ వెయ్యి ట్రక్కులను అప్పగించామని చెప్పారు.