హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధి గుండా వెళ్తున్న 163జి గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జాతీయ రహదారి 163జి, పురోగతి పై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సత్య శారద తో సమీక్షా నిర్వహించారు.