హన్మకొండ రాంనగర్ లోని తమ నివాసంలో శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తులు చేశారు. సాయంత్రం 5 గంటలకు వరకు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంతవరకు సమస్యలను ఫోన్ లోనే పరిష్కరించారు.