11 ఏళ్ల మోదీ పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కొత్తగూడెం ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, నిరంతరం పేదల కోసం పోరాడే పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.