ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం అని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ అన్నారు. సుదీర్ఘ కాలం బల్దియాలో పారిశుధ్య సిబ్బందిగా సేవలు అందించి పదవి విరమణ పొందిన సరోజ, సాయిలు ను బల్దియా జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిqగా హాజరైన కమిషనర్ శాలువాతో సత్కరించి మెమోంటో ను అందజేశారు. సుమారు 40 సంవత్సరాలుగా ఏలాంటి సెలవులు తీసుకోకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.