బరిస్తా జ్యుస్ హౌస్ పై వరంగల్ టాస్క్ఫోర్స్ కొరడ ఝళిపించింది. హన్మకొండ ఏకశిలా పార్క్ సమీపంలోని బరిస్తా జ్యుస్ హౌస్ లో ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా, కుళ్ళిపోయిన, పాడైపోయిన పండ్లను వాడుతూ, గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ జ్యూస్ తయారు చేస్తున్న, అమ్మకానికి సిద్ధంగా నిల్వచేసిన **దాదాపు 19 రకాల, సుమారు 21, 420 రూపాయల విలువ గల ఫ్రూట్ జ్యూస్ ఉత్పత్తులను శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు.