ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యాన్నీ కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం అన్నారు. రెండో డివిజన్ వంగపహాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో కనీసం గన్నీ సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.