జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఎంజీఎం నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం నర్సింగ్ కళాశాల నుండి ఐఎంఏ హాల్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు జెండా ఊపి ప్రారంభించారు. ఎంజీఎం జంక్షన్ ప్రధాన కూడలిలో ప్లకార్డులతో మానవహారం నిర్వహించారు.