వరంగల్‌: వీడిన వృద్ధురాలి మర్డర్ మిస్టరీ

79చూసినవారు
వరంగల్‌: వీడిన వృద్ధురాలి మర్డర్ మిస్టరీ
వరంగల్‌లో జరిగిన ఓ వృద్ధురాలి మర్డర్ మిస్టరీని పోలీసులు చేధించారు. కొడుకే సవతితల్లిని హత్య చేసినట్లుగా గుర్తించారు.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు నిందితుడని అరెస్టు చేసిన రిమాండ్‌కు పంపారు. ఈ హత్య హనుమకొండ శివారులోని పెగడపల్లి గ్రామంలో జరిగింది.. రెండు రోజుల క్రితం సరోజన అనే మహిళ పై గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో దాడిచేసి అతికిరాతంగా నరికిచంపారు. వృద్ధురాలిని ఎవరు చంపి ఉంటారో విచారణ చేపట్టిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.. చివరకు కొడుకే ఆస్తికోసం పథకం ప్రకారం సవతి తల్లిని హత్య చేశాడని గుర్తించారు.. నిందితుడు జైపాల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్