రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శనివారం పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న పోలీస్ డిజిపి రవి గుప్తాకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వాగతం పలికి పుష్పాగుచ్చాలను అందజేశారు. అనంతరం డీజిపి కి సాయుధ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. డిజిపిని కల్సిన వారిలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి, వున్నారు.