వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ ల కోసం నాలుగవ రోజుకు రిలే నిరాహార దీక్షలు చేరుకున్నాయి. నాలుగవ రోజు నిరసన కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోచంమైదాన్ సెంటర్లో నిరాహార దీక్ష శిబిరం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిగివచ్చి అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.