ఐనవోలు కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్ కు మొదట మమతతో వివాహం జరగగా, ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. గురువారం వరంగల్ ఎంజీఎంలో పోస్ట్ మార్టం నిర్వహించారు.