వరంగల్ జిల్లా సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిపిఎం భవాని అన్నారు. గురువారం మండలంలోని ఇల్లంద పద్మశాలి ఫంక్షన్ హాల్ లో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో మహిళ సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలు ఇంటి ఆవరణము, కాళీ పాత్రలలోనూ, పరిసర ప్రాంతాల్లో, నీటి గుంటలలో నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు.