వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ హాజరై రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్న రకానికి మాత్రమే ఇస్తాననడం రైతులను మరోసారి మోసం చేసినట్లేనని అన్నారు. బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.