వర్ధన్నపేటలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డి కి ఇచ్చిన సవాల్ ను స్వీకరిస్తూ శనివారం సాయంత్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రెస్మీట్ నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ముందుగా ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసి ఏప్రిల్ 27న వరంగల్ లో సభను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఉద్యమంలో ఉన్నప్పుడు ఆస్తుల విలువ ఎంత 10 సంవత్సరాల పాలన తర్వాత ఆస్తుల విలువ ఎంతో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.