హనుమకొండ జిల్లా మడికొండ 46వ డివిజన్ లో రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వస్కుల వీరస్వామి గుండెపోటుతో మరణించగా ఆయన భౌతిక కాయాన్ని పూలవేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు శనివారం నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మెట్టుగుట్ట దేవస్థాన చైర్మన్ పైడిపాల రఘు చందర్, 46వ డివిజన్ కంటెన్టెడ్ కార్పొరేటర్, డివిజన్ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.