వర్ధన్నపేట లోని దమ్మన్నపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ముగించుకొని గ్రామంలోని సన్న బియ్యం లబ్ధిదారు మెరుగు రాధిక -రమేష్ ల ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని శనివారం కుటుంబ సభ్యులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సహపంక్తి భోజనం చేశారు. సన్నబియంతో మంచి భోజనం పెట్టిన ఆడబిడ్డ మెరుగు రాధిక -రమేష్ లకు బట్టలు పెట్టి గౌరవించారు.