తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇంజనీర్లుగా మీరు చేపట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు అందించాల్సిన భాధ్యత ఉందని అన్నారు. ఇది నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్యతగా, ప్రజల భావోద్వేగంగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు.