భారత్- పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అధికారికంగా స్పందించింది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకం అని స్పష్టం చేసింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే, భారత్పై పాక్ సైన్యం దాడిలో వాడిన కొన్ని ఆయుధాలు చైనా నుంచి వచ్చినవేనన్న నివేదికలు వెలుగులోకి రావడంతో చైనా న్యూట్రల్గా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.