పాకిస్తాన్ దాడులకు గట్టి జవాబు ఇస్తున్నామని కల్నర్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. "పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది.. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది.. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోంది.. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ కు గట్టి జవాబు ఇస్తున్నాం." అని పేర్కొన్నారు.