భారతదేశ మీద జరుగుతున్న దాడికి పరిష్కారం చూపిస్తూ ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మీ దాడి చేయడం సరైన చర్య అని BRS నేత హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో దేశంలోని ప్రతీ యువతీ యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలన్నారు. యుద్ధానికి అవసరం పడితే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కూడా ముందుకు రావాలని చెప్పారు. సైనికుల కోసం రక్తదానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.