పాక్ సైనికులపై దాడులు చేసింది తామేనని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగానే దాడులు చేసినట్లు పేర్కొంది. పాక్పై ఆరు దాడులు చేశామని, రిమోట్ కంట్రోల్ బాంబులు, ఆయుధాలు ఉపయోగించామని తెలిపింది. పాక్ సైనికుల ఆయుధాలు, ఆహారం ట్రక్కులు పేల్చివేత, మొబైల్ టవర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.