‘పాక్‌ ఎయిర్‌ లాంఛర్లను ధ్వంసం చేశాం’: రక్షణ శాఖ

66చూసినవారు
‘పాక్‌ ఎయిర్‌ లాంఛర్లను ధ్వంసం చేశాం’: రక్షణ శాఖ
శ్రీనగర్‌, ఉధంపూర్‌, భటిండా, భుజ్‌లో పాక్‌ దాడులకు పాల్పడుతోందని విదేశాంగ, రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ‘‘పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లను పాక్‌ లక్ష్యంగా చేసుకుంది. శ్రీనగర్‌ నుంచి నలియా వరకు భారీ దాడులకు పాల్పడుతోంది. పాక్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల లక్ష్యంగా దాడులు చేశాం. ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాక్‌ కీలక స్థావరాలపై దాడులు చేశాం. పాక్‌ బలగాలు సరిహద్దు వైపు ముందుకు వస్తున్నట్లు గమనించాం’’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్