ఆపరేషన్ ‘సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పాక్.. భారత్లోని పలు ప్రాంతాల్లో గురువారం జరిపిన దాడులను అడ్డుకున్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది. శ్రీనగర్, జమ్మూ, అవంతిపొరా, పఠానో కోట్, భటిండా, ఛండీగఢ్, అమృత్సర్ సహా పలు నగరాలపై పాక్ దాడికి విఫలయత్నం చేసిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. అటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేశామని వింగ్ కమాండర్ వ్యోమిక వెల్లడించారు.