పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశామని కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. "భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా గురువారం రాత్రి పాకిస్తాన్ దాడులు చేసింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించాం. 4 ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాక్ డ్రోన్లను ప్రయోగించింది. భటిండా, ఉధంపూర్ ఎయిర్ పోర్టులే లక్ష్యంగా పాక్ దాడులు చేసింది. 36 చోట్ల చొరబాట్లకు యత్నించింది." ఆమె తెలిపారు.