పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో చోటుచేసుకున్న ఘటనలపై ఆమె స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల్లో జరిగిన వీడియోలను బెంగాల్లో జరిగినట్లుగా మోదీ అనుకూల మీడియా చూపించిందని విమర్శించారు. వక్ఫ్ చట్టంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బెంగాల్ ప్రతిష్టను కించపరచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.