టీ-కాంగ్రెస్ నాయకులు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం అడ్డుకోవడంపై BRS MLA పద్మారావు గౌడ్ మండిపడ్డారు. 'కాంగ్రెస్ వాళ్లు చేతకాని దద్దమ్మలు. హైదరాబాద్లో ఒక్క కార్పొరేటర్ గెలవరు, ఒక MLA గెలవరు. ఇలాంటి కాకి గోలలు చేస్తే మేము బెదరము. మమ్మల్ని అడ్డుకుంటే ఒక్కొకరి బొక్కలు ఇరగొడతాం. మా కార్యకర్తలు గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏండ్లు ఉద్యమాలే చేసిన వాళ్లు. ఈ 5 ఏండ్లకి భయపడరు' అని MLA తెలిపారు.