పాకిస్థాన్ డ్రోన్ దాడులపై భారత్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ డ్రోన్లతో దాడిచేసిందని తెలిపింది. జమ్మూకశ్మీర్తో పాటు పలు ప్రాంతాల్లో కాల్పుల విరమణను ఉల్లంఘించిందని పేర్కొంది. దీంతో పాక్కు గట్టిగా జవాబు ఇచ్చామని, భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. పాక్ కుట్రలన్నింటికీ దీటుగా జవాబిస్తామని స్పష్టం చేసింది.