TG: దేశంలోనే మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని, కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అలాగే మంత్రివర్గ ఉపసంఘం ఏకసభ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం వెళ్తామని స్పష్టం చేశారు.