జల్జీవన్ మిషన్, పోలవరం పూర్తీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 2027లోపు పోలవరాన్ని పూర్తిచేస్తామని అన్నారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో చర్చించామని, జల్జీవన్ మిషన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని అన్నారు. సజల్ జీవన్ మిషన్ను గత ప్రభుత్వం నిర్వీర్యంచేసింది. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం కూటమి ప్రభుత్వం బాధ్యత అని అన్నారు. కృష్ణా జలాలపై రాజకీయం చేయడం సరికాదని సీఎం హెచ్చరించారు.