సింధు జలాల ఒప్పందంపై భారత్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా స్పందించారు. ‘‘ఈ ఒప్పందంలో ప్రపంచ బ్యాంకు పాత్ర సహాయకారిగా మాత్రమే ఉంటుంది. జోక్యం చేసుకునే స్థితిలో మేము లేము. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం’’ అని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించిన భారత్, సింధు ఒప్పందాన్ని విరమించుకోవడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది.