మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేక హత్య కేసులో సాక్షుల వరుస మరణాలపై విచారణ చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. సాక్షుల వరుస మరణాల అంశంపై కేబినెట్లో చర్చించామని.. సమగ్ర దర్యాప్తు జరపాలని అదేశించామని తెలిపారు. వివేక హత్య కేసులో ఎవ్వరూ తప్పు చేసిన శిక్ష తప్పదని అన్నారు. కొంగ జపాలు చేసిన తలకిందులుగా తపస్సు చేసినా.. తప్పు చేసిన వారికి శిక్ష మాత్రం తప్పదు అని హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు.