దసరాలోపు బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తాం: పొన్నం

75చూసినవారు
దసరాలోపు బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తాం: పొన్నం
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు బకాయిపడ్డ అన్ని రకాల అలవెన్సులను దసరా లోపు చెల్లించే ప్రయత్నం చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో 33 ఎలక్ట్రిక్ బస్సులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లుగా ఆర్టీసీలో ఉద్యోగులు, బస్సుల సంఖ్య బాగా తగ్గిపోయిందని చెప్పారు. గతంలో కష్టాలను ఎదుర్కొన్న సంస్థను రక్షించే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.

సంబంధిత పోస్ట్